ఏలూరు దక్షిణపు వీధి మరియు తూర్పు వీధిలో ఘనంగా మొదలైన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం.




 ఏలూరు దక్షిణపు వీధి మరియు తూర్పు వీధిలో ఘనంగా మొదలైన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి దంపతులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు.

        భక్తుల అభీష్టాలను నెరవేర్చే శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఆటంకాలన్నీ సమసిపోవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ఆకాంక్షించారు. ఏలూరు దక్షిణపు వీధి మరియు తూర్పు వీధి లో శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజుబాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతరకు ప్రారంభ సూచికగా శుక్రవారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, ఏపీఎస్ ఆర్టీసి విజయవాడ జోనల్ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి ముడుపును స్వయంగా శిరస్సుపై ధరించి పోణంగి రోడ్డులోని శ్రీ జరుగులమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అక్కడ వేపచెట్టుకు ముడుపు కట్టే ప్రక్రియను పూర్తిచేశారు. అనంతరం దక్షిణపు వీధిలో వేంచేసియున్న శ్రీ మార్కండేయ స్వామివారి ఆలయం వద్ద రాట పాతారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ జాతర విషయంలో దక్షిణపు వీధి ప్రాంత ప్రజల చిరకాల కోరికను తీర్చే అదృష్టాన్ని అమ్మవారే తనకు వరంగా ప్రసాదించారని చెప్పారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులకు తావివ్వకుండా, అందరూ కలిసికట్టుగా పండుగ వాతావరణంలో జాతరను నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఆర్టీసి విజయవాడ జోనల్ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌లు మాట్లాడుతూ సంప్రదాయ బద్ధంగా జాతరను అంతా ఒక్కటై నిర్వహించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, కో - ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, ఈడా మాజీ చైర్మన్‌ బొద్దాని శ్రీనివాస్‌, దక్షిణపు వీధి కొలుపుల కమిటీ గౌరవ అధ్యక్షులు తుంపాల నరసింహారావు, చలివాది బ్రహ్మయ్య ,అధ్యక్ష కార్యదర్శులు అద్దేపల్లి శ్రీనివాసరావు, నాళం శ్రీ రమణ మరియు కమిటీ సభ్యులు పలువురు కూటమి పార్టీల నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post