క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు. అనకాపల్లి, నవంబర్ 03:
పోలీసు అమరవీరులు విధి నిర్వహణలో చూపిన త్యాగాలకు నివాళులర్పిస్తూ, అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంలో భాగంగా, ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమంను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీసులు సమాజ రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను ధారపోసిన మహానుభావులు. వారి త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులకు పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, పరికరాల గురించి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం,” అని పేర్కొన్నారు.
పోలీసు శాఖపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యాలు, శిక్షణ, క్రమశిక్షణల ప్రాధాన్యతపై అవగాహన ఏర్పడుతుందన్నారు. “పోలిసు శాఖ ప్రజల సేవకే అని యువత గుర్తించాలి. భవిష్యత్తులో పోలీసులు కావాలనుకునే ప్రతిభావంతులు ముందుకు రావాలి,” అని జిల్లా ఎస్పీ వివరించారు.
ఆయుధాలు పరికరాలు ఏకె-47, పిస్టల్ గ్లోక్-17, కార్బన్, ఇన్సాస్ రైఫిల్, మల్టీ గ్యాస్ గన్ లాంచర్, గ్రెనేడ్ తదితరాలు
భద్రతా పరికరాలు రైట్ గేర్ సెట్స్, బాంబ్ డిఫ్యూజల్ పరికరాలు, నైట్ విజన్, సెర్చ్ మెటల్ డిటెక్టర్లు
కమ్యూనికేషన్ పరికరాలైనా శాటిలైట్ ఫోన్, స్కానర్, వి.హెచ్.ఎఫ్ సెట్స్, రోబో సూట్
డాగ్ స్క్వాడ్ కు చెందిన బన్నీ (మత్తు పదార్థ గుర్తింపు), రియో (ట్రాకింగ్), లక్కీ (మందు పాతర గుర్తింపు)
ఫింగర్ ప్రింట్ మరియు క్లూస్ టీం నేరస్థల పరిశోధనలో సాక్ష్యధారల సేకరణ పద్ధతులు
విద్యార్థులు ఆసక్తిగా పరికరాలన పరిశీలించి, పోలీసు విభాగం పనితీరుపై ప్రశ్నలు అడిగి అవగాహన పొందారు. భాష్యం స్కూల్ విద్యార్థులు ప్రత్యేక ఉత్సాహంతో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్ రావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణ మూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, రమేష్, గఫూర్, రామకృష్ణరావు, మన్మధరావు, అనకాపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ విజయ, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
