ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష.
సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం...
క్రైమ్ 9 మీడియా. తెలంగాణ ప్రతినిధి.. అక్టోబర్ 22.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల ఆదేశించారు. నిర్మాణంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. అధునాతన పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరం సమకూర్చుకోవాలని సంబంధించిన తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని అదేవిధంగా పరికరాల ఏర్పాటుకు తగినట్లుగా గదులు ,ల్యాబ్ని ర్మాణాలు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు
ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టి ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతానికి వైద్య, ఆరోగ్యశాఖ పోలీస్ శాఖ జి.హెచ్.ఎం.సి, రోడ్లు, భవనాల శాఖ విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కమిటీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పది రోజులకు ఒకసారి సమావేశమై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సమస్యల పరిష్కరించు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికలు ముందుగానే రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు .ఆసుపత్రికి సంబంధించిన రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటినుంచి రూపొందించాలని రోడ్డు, భవనాల శాఖ అధికారులకు సూచించారు. వివిధ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జిల్లా ఆసుపత్రులకు మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని ప్రత్యేకంగా నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు నిర్మాణ పనులను ప్రత్యేకంగా పరీక్షించేలా పూర్తిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని అన్నారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు త్వరత గతిన పూర్తి చేయాలని ఈ సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.

