ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు
రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ఆలోచన అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
శుక్రవారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు రూ.30.14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ఆలోచన అని అన్నారు. అందులో భాగంగా పేద ప్రజలు ఆనారోగ్యం పాలై ఆసుపత్రి ఖర్చుల కోసం చాలా మంది ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కి దరఖాస్తు చేసుకోవడం జరుగుచున్నదన్నారు. వారిలో కొండపి నియోజకవర్గ పరిధిలో 45 మందికి 30 లక్షల 14 వేల రూపాయలు మంజూరు కాగా, వారికి ఈ రోజు చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 925 మంది లబ్దిదారులకు 7 కోట్ల 57 లక్షల 64 వేల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నదన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తూ పెద్దఎత్తున పెట్టుబడులను తీసుకురావడం జరుగుచున్నదన్నారు. రాష్ట్రంలో అన్నీ రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషణ్ చేసి సంజీవిని పధకం ద్వారా ప్రజల ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ 25 లక్షల రూపాయల వరకు ఇన్సురెన్స్ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిప్ తో వైద్య కళాశాలను త్వరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నట్లు మంత్రి అన్నారు. ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలను అందించి వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.
Add

