పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కంభంలో భారీ ర్యాలీ!!



 పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కంభంలో భారీ ర్యాలీ!!

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో కంభం బేస్తవారిపేట అర్ధవీడు సబ్ ఇన్స్పెక్టర్లు. బి నరసింహారావు. రవీంద్రారెడ్డి. నాంచారయ్య. పోలీస్ సిబ్బంది మరియు వాసవి జూనియర్ కాలేజీ విద్యార్థులు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వై జంక్షన్ నుండి కందులాపురం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరులైన పోలీసు లకు కందులాపురం సెంటర్లో మానవహారం నిర్వహించి. రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. పోలీసుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్, వి.కిరణ్ కుమార్. ఎంపీడీవో వీరభద్రా చారి. మరియు. మాజీ సైనికులు. పుల్లయ్య. అంకయ్య. ప్రసాద్. పోలయ్య. గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.

 అమరులైన పోలీసు వారి కుటుంబాలకు అండగా పోలీస్ శాఖ ఉందని ఆయన అన్నారు.

Add


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post