ఆధార్ కార్డు గుర్తింపు ధ్రువీకరణగా పరిగణించాలి: ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం.
న్యూ ఢిల్లీ :
బిహార్ సమగ్ర ఓటరు సవరణ సర్వేపై నేడు మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.
ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ ను పరిగణించాలన్న కోర్టు.
అయితే, ఆధార్ కార్డు అధికారికంగా జారీ చేసిందో లేదో సరిచూడాలన్న న్యాయస్థానం.
అంతేగాక, ఆధార్ ను పౌరసత్వ ధ్రువీకరణగా అంగీకరించకూడదంటూ వ్యాఖ్య.
