అక్రమ వ్యాపారులకు వంత పాడుతున్న ఎ పి ఎస్ఆ ర్టిసి అధికారులు.


 అక్రమ వ్యాపారులకు వంత పాడుతున్న  ఎ పి ఎస్ఆ ర్టిసి అధికారులు.


తుతు మంత్రంగా తనిఖిలు.

మంత్రిగారి పేరుతో మంతనాలు.

అ వ్యాపారులకు అమాత్యుల అండదండలు ఉన్నయంటున్న పక్క వ్యాపారులు.

తనిఖిలు మద్యలో ఆపి వెనుదిరిగిన అధికారులు.

ఒకరి ఒక న్యాయం,మరొకరికి ఒక న్యాయమా?

ప్రకాశంజిల్లా పొదిలి ఆర్టిసి బస్టాండ్ వ్యాపారులు నిత్యం వార్తలలో నిలుస్తున్నారు.

ఆర్టిసి నిబంధనల మేరకు వ్యాపారం చేయాల్సిన వ్యాపారులు నిబంధనలు అతిక్రమించి వారి ఇష్టారితీన నిబంధనలు అతిక్రమిస్తు ప్రయాణికులను దొచుకుంటున్న సంగతి బహిరంగ రహస్యమే.

మంగళవారం తనిఖికి వచ్చిన అధికారులు కొన్నిషాపులలో తనిఖి చేసి మరికొన్ని షాపులను చూసిచుడనట్లు వదిలిస్తున్నారని అదేమిటంటే వారికి మంత్రిగారి అండదండలున్నాయని అధికారులు నిశ్చేష్టులై సగం మద్యలొనే తనిఖిలు ఆపి వెళ్ళిపొతున్నారని ప్రక్క వ్యాపారులు ఆరొపిస్తున్నారు.

మంత్రిగారి ప్రమేయం ఉందొలేదొ తెలియదుగాని వారి పేరు మాత్రం పొదిలి ఆర్టిసి బస్టాండ్ లో మారు మ్రెగి పొతుంది.

_నిబంధనలు కొంతమందికైనా అందరికి వర్తించవా అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్ర మంత్రివర్యులైన ఇలా అక్రమ వ్యాపారాలు చేస్తు ప్రజలలో మంత్రిగారి పేరు చెప్పుకొనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తాయంటున్నారు.

ఉన్నతాధికారులు ఉదాశీన వైఖరి వదిలి గట్టి నిబంధనలు పాటించాలని అసలు ఈ మంత్రిగారి బంధుత్వం గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని కొరుతున్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post