వైయస్సార్సీపిని వీడి టీడీపీలోకి భారీగా వలసలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లాగిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలో వైసీపీని వీడి 13 కుటుంబాలు టీడీపీలో చేరిక – కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి
అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ పరిధిలోని బసిరెడ్డిపల్లి, తండా, మాగుటూరు గ్రామాలకు చెందిన 13 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.సర్పంచ్ జయరాం నాయక్, కరణం కాశ య్య, బత్తిని సర్వేశ్వరరావు, ఎర్రగుంట్ల రాజన్న, పేర్నపాటి రామసుబ్బయ్య గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
గంగుల వెంకటేశ్వర్లు, వల్లెల సత్యనారాయణ రెడ్డి, వెంకట రెడ్డి, ఎనుముల పెద్ద అంకాలు, వెంకట కిట్టయ్య, నల్లబోతుల లక్ష్మయ్య, చెన్నకిట్టయ్య, గోనవత్ మంత్రు నాయక్, బాలు నాయక్, దేశవత్ శ్రీరాములు నాయక్, సీతాభాయ్, రాత్లవత్ వెంకటేశ్వర్లు, నల్లబోతుల చెన్నయ్య తదితరులు వైసీపీ కాంగ్రెస్ పార్టీ ని విడి తెలుగుదేశం పార్టీలో చేరినారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారని తెలిపారు.
టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని శాసనసభ్యులు అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.


