పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ ఇన్చార్జి మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలతో కలెక్టర్ కార్యాలయం దగ్గర పెట్రోల్ డిజల్ ధరలు పెంచినందుకు నిరసన ప్రదర్శన తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈరోజు పెట్రోల్ డీజిల్ పెంపునకు నిరసనగా అలాగే మేన్ ఫెస్ట్ హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత గారికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

