జరిమానా విధించిన పలాస కోర్ట్.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
కాశిబుగ్గ టౌన్ మేదర వీధికి చెందిన ఆరి కామేష్ అలియాస్ ఆరి కామేశ్వరరావు అతని కుమారుడు ఆరి వెంకటేష్ గార్లకు అదే వీధికి చెందిన పిల్లి శ్రావణి కి వెంబడించి వేధించి చేతులతో కొట్టి బెదిరించిన కేసులో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున జరిమానా విధిస్తూ పలాస జూనియర్ సివిల్ జడ్జి యు మాధురి గారు మంగళవారం తీర్పు ఇచ్చారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ సీఐ వై రామకృష్ణ గారు తెలిపారు. 2021 వ సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తారీఖున, అంతక మునుపు, కాశీబుగ్గ టౌన్ మేదర వీధికి చెందిన పిల్లి శ్రావణి ప్రతిదినము ట్యూషన్ చెప్పడానికి వెళ్లి వస్తున్నప్పుడు, అదే స్ట్రీట్ కు చెందిన ఆరి కామేష్ వెంటపడి తనంటే ఇష్టమని అసభ్యంగా మాట్లాడుతూ వెంబడించేవాడు. ఆ విషయమై తల్లిదండ్రులు కు చెప్పగా మందలించి విడిచిపెట్టినారు. మరల అదే విషయమై పిల్లి శ్రావణి తన అక్క కుమారుడు వద్ద ఆర్ కామేసు అసభ్యంగా మాట్లాడగా ఆ విషయమై ఇంటి వద్దకు చెప్పగా శ్రావణ తల్లిదండ్రులు ఆర్ కామేష్ కు అడుగుగా ఆరి కామేషు అతని కుమారుడు వెంకటేశు చేతులతో కొట్టి చంపుతామని బెదిరించినట్లు వచ
