మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి - కలెక్టర్ పి. రాజబాబు,


 మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి - కలెక్టర్ పి. రాజబాబు,

ఈనెల 23వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మరియు రెవెన్యూ క్లినిక్ నిర్వహణ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి,కలెక్టర్ పి. రాజబాబు,

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు,

ఒంగోలు, మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రకాశం జిల్లా అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. 

అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. 

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

ఈనెల 23వ తేదీన సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

 ప్రకాశం జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post