అనకాపల్లి జిల్లా ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 అనకాపల్లి జిల్లా ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి, మార్చి :19

తెలుగు నూతన సంవత్సర ప్రారంభ సూచికగా జరుపుకునే పరాభవ' నామ సంవత్సర ఉగాది మరియు ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.ఈ ఉగాది పర్వదినం జిల్లాలోని ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులను నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను అని తెలిపారు

​క్రమశిక్షణ, దాతృత్వం, పవిత్రతకు నిలువుటద్దం రంజాన్. ముస్లిం సోదర సోదరీమణులందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలి. ఈ పర్వదినం సమాజంలో శాంతి, ప్రేమ మరియు సోదరభావాన్ని మరింత పెంపొందించాలి."

​అల్లాహ్ ఆశీస్సులతో మరియు ప్రకృతి దీవెనలతో జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని, పండుగలను అందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post