ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి చేసిన. మంత్రి డా, స్వామి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు,పేదల సంక్షేమమే లక్ష్యంతో ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల ను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
సోమవారం వారం ఉదయం కొండపి నియోజక వర్గం, టంగుటూరు మండలంలోని మల్లవరప్పాడు పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్దిదారులకు మంత్రివర్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఫించన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికినీ ఎన్నికల మ్యానిఫెస్టులో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ శివపురం గ్రామా పరిధిలో 69 మందికి 2.86 లక్షల రూపాయలు ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల ను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 2,83,200 మందికి ప్రతి నెలా 124.74 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తుండగా, రాష్ట్రంలో సుమారు 63 లక్షల మంది పేదలకు 2,722 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇంతకు ముందు 3వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని 4వేల రూపాయలకు పెంచడంతో పాటు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల బకాయిలు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ గత సంవత్సరం జులై నెలలో ఇవ్వడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు 3 వేల నుండి 6 వేల రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 5 వేల నుండి 10 వేల రూపాయలకు, పక్షవాతం వంటి వ్యాధులతో బాధపడుతూ మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉన్నవారికి 5 వేల నుండి 15 వేల రూపాయలకు పెన్షన్ పెంచడం జరిగిందన్నారు. ప్రతి నెలా ఖచ్చితంగా ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పెన్షన్ల ను పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. గత ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ ను 3 వేల రూపాయలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అన్నదాత సుఖీభవ పధకం కింద ఇప్పటికే రెండు విడతల్లో 7 వేల రూపాయల వంతున 14 వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. మరో విడత 6 వేల రూపాయలు ఫిబ్రవరి నెలలో ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటిన్లను తిరిగి తెరిపించడం తో పాటు పేదలకు 5 రూపాయలకే టిఫిన్, భోజనం ను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో సైడు కాలువలను అభివృద్ధి చేస్తూ భూగర్భ జలాలు పెరిగేలా మ్యాజిక్ డ్రెయిన్స్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, ఈ గ్రామంలో కూడా మ్యాజిక డ్రెయిన్స్ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ గ్రామానికి, మల్లవరప్పాడు గ్రామానికి తాగునీటి పధకాలకు 10 లక్షల రూపాయలు వంతున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొత్తగా ఇళ్ళు నిర్మించుకునే పేదవారికి ఇల్లు మంజురుచేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే పేదవారి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ మరియు ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ శ్రీ వెంకట రావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి శ్రీ లక్ష్మా నాయక, తహసిల్దార్ శ్రీ ఆంజనేయులు, ఎంపిడిఓ శ్రీమతి దేవసేన కుమారి, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
