బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.15 వేలు జరిమానా ఒంగోలు పోక్సో కోర్టు బుధవారం విధించిందని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మీడియాకు తెలిపారు.
2022 వ సంవత్సరంలో కొమరోలు మండలానికి చెందిన మైనర్ బాలిక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరు సమయాన్ని చూసి బాలిక నోరు మూసి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాలిక తల్లి గమనించి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
తర్వాత బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తి సాక్షాధారాలను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి నిందితుడికి జరిమానా జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు.
