గణేశ్ ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు.
వినుకొండ వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలోని కొత్తపేట గణేశ్ మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు ,వారి సతీమణి లీలావతి దంపతులు పాల్గొని. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపం వద్దకు వచ్చిన జీవి దంపతులను పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం, మండపం వద్ద ఉన్న భక్తులకు, నిర్వాహకులకు ఆయన గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

