రూ.20 లక్షలు విలువచేసే ఎరువులను సీజ్ చేసిన అధికారులు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగాదాడులు నిర్వహించారు రికార్డులు పరిశీలించిన అధికారులు విశ్వనాధపురం లోని ఓ ఎరువుల దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన రూ.20 లక్షలు విలువచేసే 1704 బస్తాల ఎరువులను అధికారులు సీజ్ చేశారు. రైతులకు ఎరువులు కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఏవో శ్రీనివాసరెడ్డి వ్యాపారులను హెచ్చరించారు.
