ఏపీలో నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్ యువతి బలవన్మరణం.
కృష్ణా జిల్లా కానూరులోని శ్రీ భారతి ఇన్స్టిట్యూట్ లాంగ్టర్మ్ కోచింగ్ సెంటర్లో మూడు వారాల కిందట నీట్ శిక్షణ కోసం చేరిన బేగంపేటకు చెందిన కంతేటి వైష్ణవి(19).
ఇన్స్టిట్యూట్ హాస్టల్లోనే ఉంటూ, ఇటీవల ఇంటికి వెళ్లి రెండ్రోజుల తర్వాత తిరిగి వచ్చి, ఇంత దూరంలో ఉంటూ చదవలేననీ తనను ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు ఫోన్ చేసిన వైష్ణవి
వారు ఆమెకు నచ్చజెప్పగా, ఈనెల 4న తనకు ఆరోగ్యం బాగోలేదని కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూంలో ఫ్యానుకు ఉరేసుకొని వైష్ణవి బలవన్మరణం
రాత్రి 9 గంటలకు యువతితో పాటు ఉండే ఇద్దరు విద్యార్థినులు తెలపడంతో, కాలేజీ సిబ్బంది రూం తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే వైష్ణవి మృతి చెందినది.
ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు...
