అటవీ భూములను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలి కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లాలోనున్న అటవీ భూములను గుర్తించి సమగ్రంగా నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా అటవీ శాఖాధికారి. వినోద్ కుమార్ తో కలసి, సంబంధిత రెవెన్యూ అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ రికార్డులలో అడవులుగా నమోదు చేయబడిన భూములు, గెజిట్ నోటిఫికేషన్లు, బ్లాక్ మ్యాప్లు, అటవీ బ్లాక్ల డిజిటైజేషన్ మరియు జియో-రిఫరెన్సింగ్తో పాటు, క్షేత్రస్థాయి ధృవీకరణ చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలో నోటిఫైడ్ అడవులు, అన్-నోటిఫైడ్ అడవుల వివరాలను గుర్తించి సమగ్రంగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ఈ జూమ్ కాన్ఫెరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, సంబంధిత రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

