కోటిరెడ్డి ని పరామర్శించిన వైయస్సార్సీపి నాయకులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉడుముల కోటిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి ,పార్టీ నాయకులు పాండురంగారెడ్డి మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
ఈ సందర్భంగా కోటిరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అనంతరం స్థానిక రాజకీయ, సామాజిక అంశాలపై వారు స్నేహపూర్వకంగా చర్చించారు. కోటిరెడ్డి గారు త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
