మృతుల కుటుంబాలను పరామర్శించిన పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినేని.
పలాస నియోజకవర్గం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మరణించిన ఇప్పిలి చాణిక్య వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన సింగిపల్లి బాలకృష్ణ గారి అన్నయ్య సింగిపల్లి లష్మినారాయణ మరియు కాసరాజు గారి మామగారైన ముక్తి బాలరాజు ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను పలాస టీడీపీ సమన్వయకర్త శ్రీ వెంకన్న చౌదరి గారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయుకులు , అక్కుపల్లి గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

