జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హాని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్సైలు.
క్రైమ్9మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, మే 27: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీడికాడ సబ్-ఇన్స్పెక్టర్ డి.లక్ష్మీనారాయణ, బుచ్చయ్యపేట సబ్-ఇన్స్పెక్టర్ పి.మనోజ్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీకి పూల మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఇరువురు ఎస్సైలను ఎస్పీ అభినందించారు. వారివారి పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, విధులను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన ఎస్సైలకు అందించిన ముఖ్యమైన సూచనలు:
స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలి. ఎన్ఫోర్స్మెంట్ పనులను మరింత పటిష్టంగా అమలు చేయాలి.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, వారికి భరోసా కల్పించాలి. శాంతి భద్రతలను కాపాడుతూ బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.
ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి.
రాత్రి వేళల్లో గస్తీ (పెట్రోలింగ్) ముమ్మరం చేయాలి. మహిళలు, పిల్లలు మరియు వృద్ధుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' మరియు ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా, చట్టపరమైన నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలి.
నూతన ఎస్సైలు ఇద్దరూ ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ, శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.

