ఘనంగా ప్రారంభమైన జుహిత్ ఆదిత్య హాస్పిటల్.
క్రైమ్ 9 మీడియా:- ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, మే 18: స్థానిక పవర్ పేట పాత బస్టాండ్ వద్ద మోతేవారి వీధిలో సోమవారం నాడు జుహిత్ ఆదిత్య మెటర్నిటీ& ఫెర్టిలిటీ హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. తొలుత దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో ఐ వి ఎఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటి మీద దృష్టి పెట్టి ఆ దిశగా వైద్య సేవలు అందించడం ద్వారా ఎక్కువమంది పేషెంట్స్ ఈ హాస్పిటల్ ద్వారా సేవలు పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ పడాల హబిత మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పేషెంట్స్ తమ హాస్పిటల్ నందు సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల లేపరోస్కోపీ సర్జరీలు తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.



