తొలిదశ జనగణ పరిశీలించిన కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత జనగణన తొలిదశలో భాగంగా హౌస్ లిస్టింగ్ జరుగుతున్న తీరును స్వయంగా వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ లకు ఎటువంటి పొరపాట్లు లేకుండా జనగణన నిర్వహించాలని సూచించారు. అదే విధంగా ప్రజలు పూర్తి వివరాలు అందజేసి జనగణన సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ పట్టణ ప్రజలను కోరారు.


