సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న కంభం ఎస్సై.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం ఎస్సై శివ కృష్ణారెడ్డి శుక్రవారం స్థానిక కందులాపురం సెంటర్లో
రహదారి భద్రత, సైబర్ నేరాలు తదితర అంశాల గురించి ప్రజలకు వివరించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలని, సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని, పాస్ వర్డ్ నెంబర్లను ఎవరికి చెప్పవద్దని, అనుమానాస్పద కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని , పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
