జిఎఫ్ఎల్ఎన్ తో పునాది పటిష్టం భవిత సుస్పష్టం.


 జిఎఫ్ఎల్ఎన్ తో పునాది పటిష్టం భవిత సుస్పష్టం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

విద్యార్థుల తల్లిదండ్రులకు ఘన సన్మానించిన ఎంఈఓ లు ఉపాధ్యాయులు,

 మార్కాపురం జిల్లా కంభం చదువులో పునాది పటిష్టంగా ఉంటే విద్యార్థుల భవిత స్పష్టంగా ఉంటుందని ఎంఈవోలు అబ్దుల్ సత్తార్ , శ్రీనివాసులు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, బుధవారం జిల్లా స్థాయిలో జిఎఫ్ఎల్ఎన్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ , గని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు పొందుర సుమతీ! అను సుమతీ శతకాన్ని ఉటంకిస్తూ, కంభం మండలంలోని పార్క్ వీధి పాఠశాల విద్యార్థి వేదాన్ష్, ఎంఆర్ జంగంగుంట్ల పాఠశాల విద్యార్థులు అంబేడ్కర్, రిషిత రెడ్డి ప్రతిభను గుర్తించిన రోజు తల్లిదండ్రులకు నిజమైన పుత్రోత్సాహమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్య లభిస్తుందని, విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాద్యాయులపై ఉందన్నారు. ఎంఈవో-2 శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని, సమగ్ర విద్యాభివృద్ధికి సమష్టి కృషి చేయాలని అన్నారు. 

అనంతరం జిల్లా స్థాయి జిఎఫ్ఎల్ఎన్ పోటీల్లో విశిష్ఠ ప్రతిభను చూపి, తల్లిదండ్రులకు,గురువులకు, పాఠశాలకు పేరు తెచ్చిన విద్యార్థులు,తల్లిదండ్రులు అందరికీ ఆదర్శంగా ఉంటారంటూ వారికి ఆత్మీయ సన్మానం చేశారు. విలువైన బహుమతులను ప్రదానం చేస్తూ, శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాద్యాయులు మాట్లాడుతూ విద్య వ్యక్తి విలువను పెంచుతుందన్న నానుడికి ప్రతీకగా తల్లిదండ్రులు సన్మాన కార్యక్రమం స్ఫూర్తిదాయక ఘట్టంగా నిలిచివుంటుందన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ విజయానికి పునాది వేసిన తల్లిదండ్రులను,గురువులను గౌరవిస్తూ పాదాభివందనం చేసి పులకించిపోయారు. ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శకం అత్యంత కీలకమని, కుటుంబం–పాఠశాల సమన్వయం ఉంటేనే ఉన్నత ఫలితాలు సాధ్యమవుతాయని ఈ విజయం ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.అనంతరం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన సిఆర్ రావిపాడు పాఠశాల ఉపాద్యాయుడు కొండలరావు మాట్లాడుతూ బోధనలో కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించడం ద్వారా అభ్యసన సులభతరం చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, సిఆర్పీలు, ఉపాధ్యాయులు, ఎంఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post