AP లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల శిక్షణ మొదలుకానుంది.
అమరావతి ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి శిక్షణ మొదలుకానుంది.ఈ నెల 16వ తేదీన మంగళగిరి బెటాలియన్ లోని పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులు వారి తల్లిదండ్రులతో సహా ఈ ప్రారంభకార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అనంతరం అభ్యర్థులంతా వారి సొంత ఊళ్లకు వెళ్లి, తిరిగి 22వ తేదీ లోపు వారికి కేటాయించిన పీటీసీ, డీటీసీ, బీటీసీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అక్కడ 9 నెలల పాటు వారికి శిక్షణ ఉంటుంది.తొలి విడత నాలుగున్నర నెలల పాటు శిక్షణ పూర్తయ్యాక వారం రోజుల పాటు సెలవులిస్తారు. తర్వాత రెండో విడత శిక్షణ ఉంటుంది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా, 6,015 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారిలో 5,551 మంది 'ఫిట్ ఫర్ ట్రైనింగ్ (శిక్షణకు అర్హత)' సర్టిఫికేట్ పొందారు. వీరందరికీ ఇప్పుడు శిక్షణ ఇవ్వనున్నారు.
