ఊర్లు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలి - SI నరసింహమూర్తి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ SI, R.నరసింహమూర్తి మరియు సిబ్బందితో కలిసి పలాస మున్సిపాలిటీ పద్మనాభపురం లో మంగళవారం సందర్శించారు గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి నారీ శక్తి గురించి, కొత్త చట్టాల గురించి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా అవగాహన కల్పించి, గ్రామంలో దేవాలయాలు, మసీదులు, చర్చ్ లు ఏమైనా ఉంటే వాటికి CC కెమెరాలు అమర్చమని, అదేవిధంగా గ్రామంలో ఏమైనా పండుగలు గాని, ఉత్సవాలు జరిగినప్పుడు గాని ఊర్లు వెళ్ళినపుడు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరేరు అదేవిధంగా సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్, పేకాట, గంజాయి, నాటు సారా అక్రమ రవాణా మరియు అమ్మకం గురించి అవగాహన కల్పించి, బాల్యవివాహాలు, మహిళలపై జరుగు నేరాలు, 112 కాల్ ఉపయాగం, మొదలైన వాటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
