జిల్లాలో జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి అధికారులకు కలెక్టర్ ఆదేశం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లాలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న జన గణనను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులకు తెలిపారు. ఈ జన గణనను చేపట్టడానికి జిల్లాలోని 21 మండలాల్లోని 497 గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో 2073 మంది ఎమ్యూనరేటర్లు, 350 మంది సూపర్వైజర్ లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఉదయం సాయంత్రం వేళల్లో అధికారులు, సిబ్బంది ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి జనగణన వివరాలు సేకరించాలన్నారు.
ఇంటికి వచ్చిన జనగణన సిబ్బందికి ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆమె చెప్పారు.
ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
