క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్.తమ్మినేని.
పలాస : 29 బుధవారం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లో గల లలితా నగర్ లో పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మేడే సందర్భంగా, శుక్రవారం మెగా వైద్య శిబిరం నిర్వహించబడును. ఈ శిబిరానికి పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంత ప్రజలతో పాటు మున్సిపాలిటీ ప్రజలు వినియోగించు కోవాలని, అసోసియేషన్ పాల్గొంటారని ఈ శిబిరం ఉదయం 8 గంటల నుండి, మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగుతుందని, పేషెంట్లు ఎవరైనా, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలంటే, 7981088 011 (నేతాజీ ) 9553868818 (జయంత్ కుమార్ )సంప్రదించాలని పేషెంట్లు కొరకు వాహన సదుపాయం అందుబాటులో ఉందని యూనియన్ కార్యదర్శి సంపత్ రావు జయంత్ కుమార్ అధ్యక్షులు నేతాజీ కోరారు, ఈ శిబిరానికి పలాసలో గల ప్రముఖ వైద్యులందరూ అందుబాటులో ఉంటారు అలాగే మెడికవర్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ప్రత్యేక వైద్య పరీక్షలు ఈ సి జి , ఆర్ బి ఎస్ , బీపీ ఉంటాయని ఉచితంగా మందులు ఇవ్వబడునని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస శాసనసభ్యులు గౌతు శిరీష, గౌరవ అతిధిగా మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు మరియు వివిధ హోదాలో ఉన్న అధికారులు అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు హాజరవుతారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు.
వేదిక : పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ఎదురుగా ఎస్.ఆర్ షాపింగ్ మాల్ పక్కలైన్ కే టి రోడ్ పలాస శ్రీకాకుళం జిల్లా.
