క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి ఆగష్టు :07
మాడుగుల మండలం మేజర్ పంచాయతీ కే.జె పురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మొదకొండమ్మ అమ్మవారు శుక్రవారం శాకాంబరీ అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
శాకాంబరీ రూపంలో అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ఆషాఢమాసంలో ఆదివారం జరగబోయే మొదమోంబ పండుగను ఉద్దేశించి మొదట్టి సరిగా అలంకరించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ బొడ్డేడ సురేష్ తెలిపారు ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొడ్డేడ సురేష్. మొదమ్మా ఉత్సవ కమిటి చైర్మన్ కాళ్ళ హరిబాల కృష్ణ. కమిటీ సభ్యులు పెద్దలు భక్తులు అదికసంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్దప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వదం తీసికున్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ఆదివారం 9 న శ్రీ మొదకొండమ్మ ఉత్సవానికి ప్రతి ఒక్కరు వచ్చింది అమ్మవారి దీవెనలు పొందాలని విజ్ఞప్తి చేశారు
